2 సంస్కృత భాష - విశ్లేషణ
శ్రీ గురుభ్యోమ్ నమః ఈ గీతా పారాయణము అనుష్టుప్ ఛందములో ఉంటుంది . అనగా ప్రతీ శ్లోకములో నాలుగు పాదాలు ఉంటాయి . ప్రతీ పాదము లోనూ ఎనిమిది అక్షరాలు ఉంటాయి . ధర్మము మూడు రకములు . కాయిక ధర్మము . ( మన శరీరము తో చేసే ధర్మ కార్యము ) వాచక ధర్మము . ( నిరంతరము ఎదుటి వారితో మంచినే మాట్లాడడము , నిత్యమూ భగవన్నామ స్మరణ సంకీర్తనాదులు చేయడము ) మానసిక ధర్మము . ( మంచి సంకల్పములు చేయడము , ఎల్లప్పుడూ మంచి విషయములనే గుర్తుంచుకోవడము ) వాచక ధర్మములో “ గీతాపారాయణము ” అత్యుత్తమ మైనదిగా చెప్పబడుతోంది . ద్వాపరయుగము చివరలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఈ భగవద్గీత కలియుగము మొదలై 5000 సంవత్సరములు అయినా...